న్యూఢిల్లీ: ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్ష సభ్యులు, ఉత్తరప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సమాజ్వాదీ పార్టీ సభ్యులు గలభా సృష్టించడంతో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. మాజీ సభ్యులు దిలీప్సింగ్ జుదేవ్ (బీజేపీ), ఎస్.ఎం.లాల్జాన్ భాషా (టీడీపీ)ల మృతికి, సబ్మెరీన్ ప్రమాదంలో నౌకాదళ సిబ్బంది మరణానికి సభ సంతాపం వ్యక్తం చేస్తున్నట్టుగా చైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించిన వెంటనే బీజేపీ, ఎస్పీ, వామపక్ష పార్టీల సభ్యులు లేచి నిలబడ్డారు. అయితే బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లు గల్లంతు కావడం తీవ్రమైన అంశమని వెంకయ్యనాయుడు అన్నారు. జీరో అవర్లో ఈ విషయం ప్రస్తావించాల్సిందిగా అన్సారీ ఆయనకు సూచించారు.
బీజేపీ సభ్యులు కూర్చోగానే ఎస్పీ సభ్యులు ఉత్తరప్రదేశ్కు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయాలంటూ వామపక్ష ఎంపీలు పోస్టర్లు ప్రదర్శించారు. సభ్యులు సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తి చేసిన చైర్మన్.. ఫలితం లేకపోవడంతో తొలిసారి 15 నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాతా ఎస్పీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో రెండోసారి మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.
ప్రధానిని కాపాడే కుట్ర: బొగ్గు శాఖకు చెందిన కీలక ఫైళ్లు మాయం కావడంపై రాజ్యసభ జీరో అవర్ విపక్షాల అరుపులతో దద్దరిల్లింది. బొగ్గు స్కాం నుంచి ప్రధానిని రక్షించేందుకు కుట్ర జరుగుతోందని విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై ప్రధాని జవాబు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ దిలీప్ సింగ్ జుదేవ్ మృతికి సంతాపం ప్రకటించాక లోక్సభ మంగళవారానికి వాయిదా వేశారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
వక్ఫ్ ఆస్తుల దురాక్రమణలను అరికట్టడంతో పాటు వాటి లీజును గరిష్టంగా ముప్పయ్యేళ్ల వరకు పొడిగించేందుకు వక్ఫ్ సవరణ బిల్లును సోమవారం రాజ్యసభ ఆమోదించింది. వక్ఫ్ సవరణ బిల్లు-2010 ద్వారా వక్ఫ్ ఆస్తులు వాణిజ్యపరంగా సక్రమంగా వినియోగించేందుకు వీలవుతుందని, వాటిపై ఏటా రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం లభిస్తుందని మైనారిటీ వ్యవహారాల మంత్రి రెహమాన్ ఖాన్ చెప్పారు.
నిరాటంకంగా ప్రశ్నోత్తరాలు: సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయాల నేపథ్యంలో అన్సారీ సోమవారం అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. వర్షాకాల సమావేశాల్లో ఇకపై శాసన పరమైన సభా వ్యవహారాలకు అంతరాయం కలిగించబోమని సభ్యులు హామీ ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు నిరాటంకంగా కొనసాగేందుకు సహకరిస్తామని చెప్పారు.
రాజ్యసభలో రగడ
Published Tue, Aug 20 2013 1:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement