న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేలలో కొందరు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తారన్న ఆప్ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ మేరకు డీపీసీసీ కార్యాలయంలో నేతృత్వంలోని శనివారం నిర్వహించిన మీడియా సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ‘మా పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారు. దేశంలోని మాది అత్యంత పురాతన పార్టీ. మేం బీజేపీ లేదా ఆప్కు సహకరించే ప్రశ్నే లేదు’ అని లవ్లీ స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు నాణేనికి బొమ్మాబొరుసు వంటివాటివని, దేనికీ తాము మద్దతు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బదులు తాజాగా ఎన్నికలు నిర్వహించడమే తమకు సమ్మతమని లవ్లీ అన్నారు.
తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతు ఇవ్వడానికి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ నాయకులు కొందరు ఇటీవల ప్రకటించారు. ఆకాలీదళ్ ఎమ్మెల్యే కూడా తమ వెంటే ఉంటారని తెలిపారు. ప్రస్తుతం బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఆరుగురి మద్దతు అవసరం ఉంటుంది. అకాలీదళ్ బీజేపీకి మిత్రపక్షమే కాబట్టి మరో ఐదుగురు సభ్యుల మద్దతు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లవ్లీ పైవివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ అగ్రనాయకుడు అరవింద్ కేజ్రీవాల్పైనా విరుచుకుపడ్డారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను రూ.20 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందని ఆరోపించడం ద్వారా ఆయన నీతిబాహ్య రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు.
‘ఆరోపణలు చేసి ఊరుకోవడం కేజ్రీవాల్ విధానం. తదనంతరం వాటిని నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలూ చూపరు. తాజాగా ఎన్నికలు నిర్వహిస్తే ఢిల్లీవాసులు ఆప్కు గుణపాఠం చెబుతారే కాబట్టే ఆయన ఇలాంటి నీతిమాలిన ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో మరోసారి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ ఈ సందర్భంగా అన్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామని ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వబోమని స్పష్టీకరించారు. మరో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు శుక్రవారం మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు తనను సంప్రదించారని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తమ అధిష్టానానికి ఇష్టం లేదన్నారు.
మా ఎమ్మెల్యేలు మాతోనే..
Published Sat, Jul 19 2014 10:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement