శివసేన, బీజేపీ పొత్తు ఓకే
శివసేనకు 151, బీజేపీకి 130, మిత్రపక్షాలకు 7 సీట్లు ఇచ్చేలా కుదిరిన అవగాహన
ముంబై/న్యూఢిల్లీ: పాతికేళ్ల బంధం నిలబడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తును కొనసాగించాలని బీజేపీ, శివసేనలు నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటులో ఏర్పడ్డ ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు పార్టీల రాష్ట్రస్థాయి నేతలు మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల పంపకానికి సంబంధించి ఒక కొత్త ప్రతిపాదనపై చర్చ జరిపామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ నేత వినోద్ తావ్దే తెలిపారు. ఆ ప్రతిపాదన వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ ప్రతిపాదనలో.. బీజేపీకి 130 స్థానాలు ఇచ్చేందుకు శివసేన అంగీకరించింది. అదే సమయంలో తాము మొదట్నుంచీ చెబుతున్నట్లుగా 151 సీట్లలో సేన పోటీ చేస్తుంది. బీజేపీకి పెరిగే సీట్ల మేరకు మహాకూటమి(మహాయుతి)లోని ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలో కోత విధిస్తారు. కూటమిలోని మిత్రపక్షాలైన ఆర్పీఐ(అథవలే), రాష్ట్రీయ సమాజ్పక్ష్, స్వాభిమాని షేత్కారీ పక్ష్, శివ్ సంగ్రామ్లతో ఈ ప్రతిపాదనపై చర్చించి, వాటి ఆమోదం తరువాత దీన్ని అధికారికంగా ప్రకటిస్తారు. పై ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఆ మిత్రపక్షాలకు 7 స్థానాలు మాత్రమే మిగుల్తాయి. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెప్పడం, కనీసం 130 సీట్లు కావల్సిందేనని బీజేపీ పట్టుబట్టడంతో పొత్తు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటం తెలిసిందే.
ప్రజలు కోరుకుంటున్నారు: ఉద్ధవ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న తన ఆశను పక్షం రోజుల క్రితం బహిరంగంగా వెల్లడించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అది ప్రజల ఆకాంక్షేనంటూ మంగళవారం మాట మార్చారు.
కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు అసంపూర్ణం
కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల నేతలు మంగళవారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారిక నివాసంలో మంగళవారం జరిగిన సుదీర్ఘ చర్చల్లో 124 స్థానాల్లో పోటీ చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ఎన్సీపీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 144 సీట్లు కావాల్సిందేనని పట్టుబట్టింది. కాగా, ఎన్సీపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది.
కాషాయ బంధం నిలిచింది!
Published Wed, Sep 24 2014 1:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement