మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆమె ఈ విషయమై ఆదివారం రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. బీజేపీ మిత్రపక్షాలైన తమిళ పార్టీలు డీఎండీకే, ఎండీఎంకే కూడా రాజపక్సను ఆహ్వానించడాన్ని వ్యతిరేకించాయి.
రాజపక్స రాకకు నిరసనగా సోమవారం ఢిల్లీలో నల్లజెండాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎండీఎంకే అధినేత వైగో ప్రకటించారు. కాగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, కేరళల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, ఊమెన్ చాందీలు మోడీ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు కానున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.