దరఖాస్తులో ట్రాన్స్జెండర్ అని పేర్కొనబడి పాస్ పోర్టు పొందిన తొలి వ్యక్తిగా సత్యశ్రీ శర్మిల నిలిచారు.
తొలిసారి దరఖాస్తులో ట్రాన్స్జెండర్ అని పేర్కొనబడి పాస్ పోర్టు పొందిన మొదటి వ్యక్తిగా సత్యశ్రీ షర్మిల నిలిచారు. లా గ్రాడ్యుయేట్ అయిన సత్యశ్రీ పాస్ పోర్టు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించగా అందులో జెండర్ తెలిపే కాలమ్స్ రెండే ఉన్నాయి. సాధారణంగా రెండే ఉంటాయి కూడా. అయితే, సత్య శ్రీ ఒక ట్రాన్స్జెండర్. దాంతో తాను ఏ జెండర్ కాలమ్లో టిక్ చేయాలో అర్థంకాక పాస్ పోర్టు కార్యాలయాన్ని సంప్రదించింది. దానికి వారు ఇష్టం వచ్చినదాన్ని టిక్ చేయండని అనంతరం తాము సరిచేస్తామని చెప్పారు. కానీ అలా మార్పు జరగలేదు.
కొన్ని నెలల కిందట ట్రాన్స్ జెండర్స్ కూడా ఒక ప్రత్యేక లింగమేనని సుప్రీంకోర్టు గత ఏప్రిల్ 2014లో పేర్కొంది. వారికి కూడా కోటా ఇప్పించాలని, ఓటరు కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్లలలో ప్రత్యేక లింగంగా పేర్కొనాలని కూడా సూచించింది. ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ సత్యశ్రీ పాస్ పోర్టు అధికారుల చుట్టూ తిరిగి తన దరఖాస్తులో ట్రాన్స్ జెండర్ అనే కాలమ్ను చేర్చేలా చేసి చివరికి పాస్ పోర్టు సాధించటం విశేషం. ఈ విధంగా మహారాష్ట్రలోనే కాకుండా దేశం మొత్తంలో కూడా మొట్ట మొదటిసారి ట్రాన్స్జెండర్ పేరుతో పాస్ పోర్టు పొందిన వ్యక్తి సత్య శ్రీనే.