కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
బెంగళూరు, న్యూస్లైన్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. బెంగళూరుకు చెందిన మధుసూదన్(36), రూప(33)కు ఆరేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. జేపీ నగర్లో ఓ అపార్ట్మెంట్ 13వ అంతస్తులో గల ఫ్లాట్లో ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలున్నాయి. శుక్రవారం వీరు తమ కుమార్తెను అవ్వ ఇంటిలో వదిలిపెట్టారు. ఆఫీసు తర్వాత రాత్రికి ఇంటికొచ్చి గొడవ పడ్డారు.
మధుసూదన్ కత్తితో భార్యను పొడిచి హత్యచేశాడు. అనంతరం భయంతో ఫ్యాన్కు ఉరేసుకునేందుకు యత్నించగా. తాడు తెగిపోయింది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అది సాధ్యపడకపోవడంతో తాముంటున్న 13వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.