‘కోస్టల్‌ బెర్త్‌’లో రూ. 2,302 కోట్ల ప్రాజెక్టులు | Financial Assistance of rs 2,302.05 Crore for Projects under Coastal | Sakshi
Sakshi News home page

‘కోస్టల్‌ బెర్త్‌’లో రూ. 2,302 కోట్ల ప్రాజెక్టులు

Nov 4 2017 3:45 AM | Updated on Nov 4 2017 3:45 AM

Financial Assistance of rs 2,302.05 Crore for Projects under Coastal  - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సాగరమాల కింద ‘కోస్టల్‌ బెర్త్‌ పథకం’లో రూ. 2,302 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నామని కేంద్రం ప్రకటించింది. మొత్తం 47 ప్రాజెక్టులకు గాను మహారాష్ట్రకు 12, ఏపీ, గోవాలకు పదేసి చొప్పున, కర్ణాటక 6, కేరళ, తమిళనాడుకు మూడేసి, గుజరాత్‌ 2, పశ్చిమ బెంగాల్‌కు ఒక ప్రాజెక్టు కేటాయించామని కేంద్ర నౌకాయాన శాఖ తెలిపింది. ఈ పథకంలో ప్రముఖ ఓడరేవులు, రాష్ట్రాల మారీటైం బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకూ రూ. 620 కోట్లు మంజూరు చేశామని, మిగతా 24 ప్రాజెక్టులకు అనుమతుల కేటాయింపులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది.   

Advertisement
 
Advertisement
Advertisement