న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2014-15లో కూడా ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీనే చెల్లించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) మంగళవారం నిర్ణయించింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి నరేంద్రసింగ్ తొమర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్వో అత్యున్నత నిర్ణాయక సంస్థ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖ లాంఛనంగా ఆమోదించి అమలు చేయాల్సి ఉంది. ఈపీఎఫ్వో 2012-13లో పీఎఫ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ చెల్లించగా 2013-14లో 8.75 శాతం వడ్డీ చెల్లించింది. ఈపీఎఫ్వోకు సుమారు 5 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.
మరోవైపు ఉద్యోగుల డిపాజిట్ అనుసంధాన బీమా (ఈడీఎల్ఐ) పథకం కింద అందించే ప్రయోజనాన్ని ప్రస్తుతమున్న రూ 1.56 లక్షల నుంచి గరిష్టంగా రూ. 3.60 లక్షలకు పెంచనున్నట్లు ఈపీఎఫ్వో కేంద్ర ప్రావిడెంట్ కమిషనర్ కె.కె.జలాన్ తెలిపారు. ఈడీఎల్ఐ కింద హామీ ఇచ్చే మొత్తాన్ని ప్రస్తుతం రూ. 6,500గా ఉన్న నెలవారీ వేతన సీలింగ్ నిష్పత్తి ప్రకారం ఇస్తుండగా త్వరలోనే రూ. 15 వేలకు పెంచనున్నారు. వేతన సీలింగ్ పెంపుతోపాటు ఈపీఎఫ్వో అందించే ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలకు రూ. వెయ్యి కనీస పెన్షన్ చెల్లింపుపై నోటిఫికేషన్లను త్వరలోనే అమలు చేస్తామని కార్మికశాఖ అధికారులు ట్రస్టీల బోర్డు సమావేశంలో పేర్కొన్నారు.
ఈపీఎఫ్ వడ్డీ 8.75%
Published Wed, Aug 27 2014 3:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement