జవాబులు బాగున్నా.. మార్కులు సున్నానా? | Delhi High Court orders to CBSE on Re-valuation issue | Sakshi
Sakshi News home page

జవాబులు బాగున్నా.. మార్కులు సున్నానా?

Jun 22 2017 1:39 AM | Updated on Aug 31 2018 8:34 PM

పునఃమూల్యాంకనాన్ని (రీవాల్యుయేషన్‌) అసలు ఎందుకు తీసేస్తున్నారో తెలపాలని ఢిల్లీ హైకోర్టు సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌)ను బుధవారం ఆదేశించింది.

న్యూఢిల్లీ: పునఃమూల్యాంకనాన్ని (రీవాల్యుయేషన్‌) అసలు ఎందుకు తీసేస్తున్నారో తెలపాలని ఢిల్లీ హైకోర్టు సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌)ను బుధవారం ఆదేశించింది. ఓ విద్యార్థి సమాధాన పత్రంలో జవాబులు సరిగానే ఉన్నా, సున్నా మార్కులు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. సీబీఎస్‌ఈ పునఃమూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును గతంలో ఆశ్రయించారు.

ఈ కేసు విచారణను జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ, జస్టిస్‌ ఏకే చావ్లాల ధర్మాసనం బుధవారం కొనసాగించింది. కూడికలు చేయడమే రాని వారు గణిత శాస్త్రపేపర్లు దిద్దితే విశ్వసనీయత ఏం ఉంటుందని కోర్టు సీబీఎస్‌ఈని ప్రశ్నించింది.  తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement