రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలి | central govt sholud increase rail budget to telangana: mp boora narsaiah | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలి

Apr 22 2015 2:58 AM | Updated on Aug 20 2018 9:16 PM

రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలి - Sakshi

రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలి

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు.  లోక్‌సభలో రైల్వే నిధుల డిమాండ్ అంశంపై మంగళవారం జరిగిన చర్చలో ఎంపీ బూర మాట్లాడుతూ.. మునిరాబాద్-మహబూబ్‌నగర్, మనోహరాబాద్-కొత్తపల్లి, భద్రాచలం-కొవ్వూరు, మాచర్ల-నల్లగొండ, భద్రాచలం-సత్తుపల్లి, అక్కనపేట-మెదక్, కాజీపేట-బలార్షా, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు తక్కువ నిధులు కేటాయించారని, ఈ ప్రాజెక్టులకు సాధ్యమైన మేరకు నిధులు పెంచాలని విన్నవించారు. కాజీపేట రైల్వేజోన్ ప్రకటించాలని, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల రాజధానుల మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలు నడిపించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement