బీఫ్ నిషేధం కొనసాగుతుంది: హైకోర్టు | Ban on beef to continue in Maharashtra:Bombay HC | Sakshi
Sakshi News home page

బీఫ్ నిషేధం కొనసాగుతుంది: హైకోర్టు

May 6 2016 12:42 PM | Updated on Sep 3 2017 11:32 PM

ముంబై హైకోర్టు మహారాష్ట్రలో గోవధ నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం కోడెలు, ఎద్దులను వధించడం నిషేధిస్తూ చేసిన చట్టాన్ని కో్ర్టు సమర్ధించింది.

ముంబై : మహారాష్ట్రలో గోవధ నిషేధం కొనసాగుతుందని బాంబే హైకోర్టు శుక్రవారం తెలిపింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చిన ఆవు మాంసాన్ని తినటంలో తప్పులేదని కోర్టు వినూత్నంగా తీర్పునిచ్చింది. అభయ్ ఓకా, సురేష్ గుప్ లతో కూడిన డివిజనల్ బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది బీఫ్ వినియోగంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

చట్టానికి విరుద్ధంగా జంతుబలికి పాల్పడే వారికి ఐదేళ్లు జైలుతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బీఫ్ బ్యాన్పై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, మరోవైపు బయట నుంచి తెచ్చుకున్న గోమాంసం తినటంలో తప్పులేదని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement