రియో అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ | Athletes click selfies with PM Modi as latter gives send-off to Indian contingent for RioOlympics 2016 | Sakshi
Sakshi News home page

రియో అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ

Jul 4 2016 1:14 PM | Updated on Aug 15 2018 2:30 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన భారత అథ్లెట్లలో సమావేశం అయ్యారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన భారత అథ్లెట్లలో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని మానేక్షా కేంద్రం వద్ద రియో ఒలింపిక్ బృందంలోని అథ్లెట్లతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రియో ఒలింపిక్స్లో రాణించాలని ఆకాంక్షించారు. కాగా బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరిగే రియో క్రీడలకు 13 క్రీడాంశాల నుంచి 100కుపైగా భారత అథ్లెట్లు  బెర్త్ దక్కించుకున్న సంగతి విదితమే. మరోవైపు ప్రధానితో కరచరణం చేస్తూ అథ్లెట్లు సెల్ఫీలు తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement