కోవిడ్‌-19 ఎఫెక్ట్‌ : అమర్‌నాథ్‌ యాత్ర రద్దు | Amarnath Yatra Cancelled Due To Corona Virus | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19 ఎఫెక్ట్‌ : అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

Apr 22 2020 7:51 PM | Updated on Apr 22 2020 8:08 PM

Amarnath Yatra Cancelled Due To Corona Virus - Sakshi

అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేసిన అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దయింది. గత ఏడాది జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో అమర్‌నాథ్‌ యాత్ర నుంచి యాత్రికులు తమ పర్యటనను కుదించుకుని వెననుతిరిగారు. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు అమర్‌నాథ్‌ బోర్డు బుధవారం ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,471కి పెరిగింది. కరోనా బారినపడి బుధవారం 49 మంది మరణించడంతో మృతుల సంఖ్య 652కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

చదవండి : క‌రోనాలో హెచ్ఐవీ వైర‌స్ ఆన‌వాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement