కొత్త వారి కోసం ఆప్ వేట
న్యూఢిల్లీ: గోవా వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరాదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. గత సెప్టెంబర్లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు గోవా వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి స్థానంలో కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీమాపురి ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ కోలీ, అంబేద్కర్ నగర్ శాసనసభ్యుడు అశోక్ కుమార్ చౌహాన్, దియోలీ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్లు సెప్టెంబర్ 22న గోవా వెళ్లారు. వారు వెళ్లిన విషయం తెలియగానే పార్టీ అధిష్టానం వెంటనే తిరిగి వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది.
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు వెళ్లినట్టు ఢిల్లీలో వార్తలు వెలువడ్డాయి. కానీ వారు కేవలం గోవాలో పర్యటించేందుకు మాత్రమే వెళ్లినట్లు అప్పట్లో ఆప్ నేతలు వివరణ ఇచ్చారు. కానీ, నిజానికి వీరు బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్షుడు షేర్సింగ్ డాగర్ను కలిసేందుకు వెళ్లినట్టు ఆ తరువాత వెల్లడైంది. ఆ ఉదంతం తమను తీవ్ర ఇబ్బందికి గురి చేసిందని పార్టీ నాయకుడొకరు చెప్పారు. ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు షేర్సింగ్ డాగర్ ప్రయత్నిస్తుండగా, చిత్రీకరించిన వీడియోను ఆప్ నేతలు విడుదల చేశారు.
ఇదిలా ఉండగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజు ధింగన్ (త్రిలోక్పురి), వీణా ఆనంద్ (పటేల్నగర్)లకు కూడా ఈసారి టికెట్ లభించకపోవచ్చని భావిస్తున్నారు. అయితే వారి విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆప్ నేతలు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ధింగన్ తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారని, అయితే ఆయనకు మీడియో మాట్లాడటం చేతకాదని ఓ నాయకుడు అన్నారు. అయితే ధింగన్ చేసిన అభివృద్ధి పనులపై ఒక నివేదికను రూపొందించాలని ఆప్ నేతలు పార్టీ వాలంటీర్లు, కార్యకర్తలను ఆదేశించారని చెప్పారు. మరో డజను మంది ఎమ్మెల్యేలకు మాత్రమే రెండోసారి ఆప్ టికెట్ దక్కే అవకాశాలున్నాయని ఆ నాయకుడు తెలిపారు.
గోవా వెళ్లిన వారికి టికెట్ లేదు
Published Sat, Nov 22 2014 12:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement