ఏడుగురు ఉగ్రవాదులు హతం.. జవాను మృతి | 1 jawan, 7 militants killed as Army foils multiple infiltration bids along LoC | Sakshi
Sakshi News home page

ఏడుగురు ఉగ్రవాదులు హతం.. జవాను మృతి

Jun 8 2017 7:57 PM | Updated on Sep 5 2017 1:07 PM

జమ్ముకశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక జవాను వీరమరణం పొందగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక జవాను వీరమరణం పొందగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

బారాముల్లా, బందిపోరా, కుప్వారా జిల్లాలో గత రెండు రోజులుగా ఈ ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. పలువురు ఉగ్రవాదులను భారత సైనికులపై దాడులు చేసేందుకు నియంత్రణ రేఖ వెంబడి ఉండే పాక్‌ బలగాలు కుట్రలు చేస్తున్నాయని, వాటిని తాము సమర్థంగా విఫలం చేశామని ఉదంపూర్‌ కు చెందిన కల్నల్‌ అధికారి ఎన్‌ఎన్‌ జోషి చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement