నాలుగేళ్ల తర్వాత...

Three Years In The Making, Rana Daggubati's Movie Officially - Sakshi

అదిగో ఇదిగో అంటూ సినీప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న రానా ‘హిరణ్యకశ్యప’ సినిమా అధికారిక ప్రకటన రానే వచ్చింది. దర్శకుడు గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘హిరణ్యకశ్యప’పై నేను వర్క్‌ చేస్తున్నాను. నటుడు రానా దగ్గుబాటి టైటిల్‌ రోల్‌ చేయనున్నారు. విస్తృత స్థాయిలో మూడేళ్లుగా ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవును.. మూడేళ్లుగా చేస్తూనే ఉన్నాం. చాలా ఉత్తేజంగా ఉన్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం.

రానాతో ఇది ఎగై్జటింగ్‌ జర్నీగా ఉండబోతోంది’’ అని దర్శకుడు గుణశేఖర్‌ వెల్లడించారు. ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మైథలాజికల్‌ సినిమా కాబట్టి గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా బాగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే ... 2015లో వచ్చిన పీరియాడికల్‌ మూవీ ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ‘అరణ్య’ సినిమాతో రానా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top