జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

Manmadhudu 2 Trailer is All Set to Launch on July 25th - Sakshi

నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటిస్తోన్న తాజా చిత్రం ‘మ‌న్మథుడు 2’. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్రన్ ద‌ర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్తయ్యింది.

ప్రస్తుతం డ‌బ్బింగ్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌, అవంతిక స్పెషల్ టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 25న ఈ సినిమా థియట్రికల్‌ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగ‌స్ట్ 9న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top