మహేశ్‌తో మరో సినిమా? | Kiara Advani and Mahesh Babu to team up again | Sakshi
Sakshi News home page

మహేశ్‌తో మరో సినిమా?

Jun 4 2020 5:25 AM | Updated on Jun 4 2020 8:01 AM

Kiara Advani and Mahesh Babu to team up again - Sakshi

‘కియారా అనే నేను’ అంటూ ‘భరత్‌ అనే నేను’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు కథానాయిక కియారా అద్వానీ. గత ఏడాది ‘వినయ విధేయ రామ’లో కనిపించారు. ఈ ఉత్తరాది భామకు దక్షిణాదిన మంచి మార్కులే పడ్డాయి. అయితే ‘వినయ విధేయ...’ తర్వాత కియారా మరో తెలుగు సినిమా కమిట్‌ కాలేదు. కారణం హిందీలో నాలుగైదు సినిమాలు ఉండటమే. ఇప్పుడు కియారా ఓ తెలుగు సినిమా కమిట్‌ కాబోతున్నట్లు సమాచారం.

ఏ హీరో సినిమా ద్వారా అయితే తెలుగుకి పరిచయం అయ్యారో అదే హీరో సినిమాలో నటించబోతున్నారట. ‘భరత్‌ అనే నేను’లో మహేశ్‌బాబుకి జోడీగా కనిపించిన కియారా ఇప్పుడు ‘సర్కారువారి పాట’లోనూ మహేశ్‌ సరసన నటించబోతున్నారట. పరశురామ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలోని మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదలైంది. మరి.. మహేశ్‌–కియారా జంట మళ్లీ తెర మీద కనబడుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement