అధరం తాంబూలం! | Celebrities are not free. | Sakshi
Sakshi News home page

అధరం తాంబూలం!

Aug 3 2016 11:54 PM | Updated on Sep 4 2017 7:40 AM

అధరం తాంబూలం!

అధరం తాంబూలం!

సెలబ్రిటీలకు స్వేచ్ఛ ఉండదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టిన క్షణం నుంచీ రహస్య కెమేరాలు వెంటాడతాయ్.

 సెలబ్రిటీలకు స్వేచ్ఛ ఉండదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టిన క్షణం నుంచీ రహస్య కెమేరాలు వెంటాడతాయ్. అది గ్రహించే ప్రముఖులు కూడా అప్రమత్తంగా ఉంటారు. అయినా ఏదో చోట దొరికిపోతారు. ఈ మధ్య ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అలానే దొరికిపోయింది. ఈ టీనేజ్ బ్యూటీ ఇటీవల శిఖర్ పహారియా అనే కుర్రాడితో ముద్దుల మూడ్‌లో ఉన్నప్పుడు రహస్యంగా ఎవరో కెమెరాలో బంధించారు. తీసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా జాన్వీ, శిఖర్‌ల ముద్దూ ముచ్చట తాలూకు ఫొటోను బయటపెట్టారు.

ఇంతకీ ఈ శిఖర్ పహారియా ఎవరంటే.. కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు. ఓ ప్రైవేట్ పార్టీలో జాన్వీ, శిఖర్‌లు ఈ విధంగా పట్టుబడ్డారని టాక్. ప్రస్తుతం జాన్వీ న్యూయార్క్‌లో ఉంది. అక్కడ నటనలో శిక్షణ తీసుకుంటోంది. మరో రెండేళ్ల లోపు తను కథానాయికగా పరిచయమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement