ఢిల్లీకి చేరుకున్న తెలుగోళ్లు | telugu people reached delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి చేరుకున్న తెలుగోళ్లు

Apr 26 2015 9:59 AM | Updated on Oct 20 2018 6:37 PM

నేపాల్లో శనివారం సంభవించిన భూకంపంలో చిక్కుకున్న తెలుగోళ్లు అదృష్టవశాత్తూ బయటపడ్డారు.

హైదరాబాద్: నేపాల్లో శనివారం సంభవించిన భూకంపంలో చిక్కుకున్న తెలుగోళ్లు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నట్టు తాజాగా సమాచారం అందింది. మొత్తం 54 మంది తెలుగు వాళ్లు ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో  34 మంది తెలంగాణకు, 19 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. తెలంగాణ వారిలో 35 మంది కూడా హైదరాబాద్ నగరానికి చెందిన వారే. నగరంలోని హయత్ నగర్కు చెందిన 11 మంది, మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన 24 మంది అందులో ఉన్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement