లండన్‌లో మళ్లీ కలకలం.. వరుసగా ఢీకొట్టిన వాహనం

లండన్‌లో మళ్లీ కలకలం.. వరుసగా ఢీకొట్టిన వాహనం

లండన్‌: పది రోజులు కూడా పూర్తవకముందే లండన్‌లో మరో దుర్మార్గం. గతంలో మాదిరిగానే పాదచారులపైకి ఓ వాహనం దూసుకెళ్లి భీభత్సం సృష్టించింది. సరిగ్గా లండన్‌లోని సెవెన్‌ సిస్టర్స్‌ రోడ్డులోగల ముస్లింల సంక్షేమ భవనం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సమీపంలోనే ఫిన్స్‌బరీ పార్క్‌ మసీదు ఉంది. అర్ధరాత్రి ప్రార్థనలు ముగిసన తర్వాత ఈ మార్గం నుంచే ముస్లిలు వెళుతుంటారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు వాహన డ్రైవర్‌ను అరెస్టు చేశారు.



ప్రస్తుతానికి ఈ సంఘటనను తీవ్రమైనదేనని చెబుతున్న పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశ పూర్వకంగా అతడు ఇలా చేశాడా అనే విషయాన్ని శోధిస్తున్నట్లు తెలిపారు. దాదాపు పదిమిందిని ఈ వాహనం ఢీకొట్టింది. అంతకుముందు లండన్‌ బ్రిడ్జిపై కూడా ఉగ్రవాదుల వాహనం పాదచారులపైకి దూసుకెళ్లి పలువురు చనిపోయేందుకు కారణమైన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన ఘటనపట్ల పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడ అప్రమత్తమై మరోసారి అనుమానిత ప్రాంతాలపై దృష్టి సారించారు. మొత్తం 12మంది ఈ ఘటనలో గాయపడినట్లు తెలుస్తోంది. 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top