టీవీ రిపోర్టర్‌ను వెంటాడిన పంది.. | Sakshi
Sakshi News home page

టీవీ రిపోర్టర్‌ను వెంటాడిన పంది..

Published Thu, Nov 28 2019 6:26 PM

Pig Chases Greek TV Reporter In Live - Sakshi

లైవ్‌ టీవీ రిపోర్టింగ్‌ చేసే జర్నలిస్ట్‌లకు కొన్నిసార్లు అనుహ్య పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా గ్రీక్‌కు చెందిన ఓ రిపోర్టర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఏఎన్‌టీ1 టీవీకి చెందిన మాంటికోస్ అనే రిపోర్టర్‌ కైనెటా నగరంలో వరద నష్టంపై రిపోర్ట్‌ చేస్తున్నాడు. అయితే అతను రిపోర్టింగ్‌ చేస్తున్న సమయంలో ఓ పంది అతని వద్దకు వచ్చింది. అయితే దాని నుంచి తప్పించుకుని రిపోర్ట్‌ చేద్దామని చూసిన అది అతన్ని వెంబడించింది. 

ఆ సమయంలో స్టూడియోలో ఉన్న జర్నలిస్టులతో మాంటికోస్‌ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఓ పంది మమ్మల్ని ఉదయం నుంచి వెంబడిస్తుంది. పంది నన్ను కోరకాడానికి ప్రయత్నిస్తుంది.. అందుకే ఇక్కడ నిల్చోలేకపోతున్నాను. నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. ఇది అంతా చూస్తున్న స్టూడియోలోని జర్నలిస్టులు తమ నవ్వును ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలో లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్న మహిళా రిపోర్టలతో కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement