'ఉగ్రవాద అంతానికి ప్రపంచం ఏకం కావాలి' | narendra modi attends g-20 meeting | Sakshi
Sakshi News home page

'ఉగ్రవాద అంతానికి ప్రపంచం ఏకం కావాలి'

Nov 15 2015 3:51 PM | Updated on Aug 15 2018 2:20 PM

'ఉగ్రవాద అంతానికి ప్రపంచం ఏకం కావాలి' - Sakshi

'ఉగ్రవాద అంతానికి ప్రపంచం ఏకం కావాలి'

ఉగ్రవాదులను అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

అంకారా: ఉగ్రవాదులను అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం టర్కీలో జీ 20 సదస్సులో మోదీ ప్రసంగించారు.

పారిస్ ఉగ్రవాదదాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు పోరాడాలని మోదీ పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని మోదీ అక్కడ నుంచి టర్కీకి వెళ్లిన సంగతి తెలిసిందే. పారిస్ ఉగ్రవాద దాడిలో మరణించినవారి సంఖ్య 129కి పెరిగింది. మరో 352 మంది గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement