* ఎక్కువ బరువున్న పరికరాలు మోసుకెళ్లేలా ప్రయోగాలు
* డిసెంబర్లో జీఎస్ఎల్వీ మార్క్-3, అబార్ట్ మిషన్
* విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెరైక్టర్ వెల్లడి
* ప్రారంభమైన హై ఎనర్జీ మెటీరియల్స్ సదస్సు
సాక్షి, హైదరాబాద్: భారత్ ప్రయోగించే ఉపగ్రహాలను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా వాటికి ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థను జోడించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎఎస్సీ) డెరైక్టర్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. దీనివల్ల ఇంధన ట్యాంకుల సైజు తగ్గుతుందని, దీంతో ఎక్కువ బరువున్న పరికరాలను మోసుకెళ్లడం వీలవుతుందని చెప్పారు.
హైదరాబాద్లో గురువారం హై ఎనర్జీ మెటీరియల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు కె.శివన్ ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్ఎల్వీ మార్క్-3ని ఈ ఏడాది డిసెంబరులో ప్రయోగిస్తామని వివరించారు. చంద్రుడిపై రోవర్ ల్యాండ్ అయి పరీక్షలు నిర్వహించే లక్ష్యంతో చంద్రయాన్-2 సిద్ధమవుతోంద న్నారు. మానవసహిత ప్రయోగాల్లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను రక్షించేందుకు ఉద్దేశించిన అబార్ట్ మిషన్ను ఈ ఏడాది చివరలో చేపడతామన్నారు.
పేలుడు పదార్థాలు గుర్తించేందుకు...
పేలుడు పదార్థాలను గుర్తించేందుకు జాగిలాలు కొంత మేరకే ఉపయోగపడుతున్న నేపథ్యంలో పుణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ ఓ కిట్ను అభివృద్ధి చేసిందని సంస్థ డెరైక్టర్ డాక్టర్ కేపీఎస్ మూర్తి తెలిపారు. ఈ సాంకేతికతను అగ్రరాజ్యం అమెరికాకు కూడా అందించామని చెప్పారు. మందమైన బ్యాగులు, లోహపు పెట్టెల్లో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను కూడా సులువుగా గుర్తించేందుకు తాము ప్రత్యేకమైన పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఓ కేంద్రం ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.
కార్యక్రమంలో డీఆర్డీఎల్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ (ఎఎస్ఎల్) డెరైక్టర్లు కె.జయరామన్, టెస్సీ థామస్తోపాటు సదస్సు నిర్వాహక కమిటీ కో చైర్మన్, అగ్ని-3 ప్రాజెక్ట్ డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీవో డెరైక్టర్ జనరల్ (మిస్సైల్స్) సతీశ్ కుమార్ హై ఎనర్జీ మెటీరియల్స్ కాన్ఫరెన్స్, ఎగ్జిబిట్స్ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు.
ఉపగ్రహాలకు ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థ
Published Fri, Feb 12 2016 4:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement