సోమాలియాలో మళ్లీ దారుణం | Gunmen storm hotel in Mogadishu and 15 killed, police say | Sakshi
Sakshi News home page

సోమాలియాలో మళ్లీ దారుణం

Jun 25 2016 11:36 PM | Updated on Aug 14 2018 3:22 PM

సోమాలియాలో మళ్లీ దారుణం - Sakshi

సోమాలియాలో మళ్లీ దారుణం

సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ వద్ద తీవ్రవాదులు శనివారం బాంబు దాడులతో పాటు కాల్పులకు తెగబడ్డారు.

సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ వద్ద తీవ్రవాదులు శనివారం బాంబు దాడులతో పాటు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహమద్ అబ్దుల్ ఖాదీర్ వివరాల ప్రకారం.. పెట్రోల్ పంప్, షాపింగ్ మాల్స్ ఉన్న హోటల్ సమీపంలో ఈ దాడి జరిగింది. సామాన్య పౌరులే ఈ దుర్ఘటనలో ఎక్కువగా మృతిచెందారని తెలిపారు. నాసో హబ్లాడ్ హోటల్ గేటు వద్ద తొలుత కారు బాంబు పేల్చిన తర్వాత సాయుధులు కాల్పులకు తెగబడ్డారని వెల్లడించారు. ఆ హోటల్ లో ఎక్కువగా ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, విదేశాలకు చెందిన ముఖ్య వ్యక్తులు, జర్నలిస్టులు బస చేస్తారని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడి ఉండొచ్చని ఓ ఉన్నతాధికారి దాహిర్ వివరించారు.

మూడు వారాల కిందట రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ పై తీవ్రవాదులు బాంబు దాడులతో పాటు కాల్పులకు తెగబడ్డ ఘటనలో దాదాపు 15 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారిలో ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. అప్పట్లో ఆ కాల్పులకు పాల్పడ్డ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు హతమార్చారు. మిలిటెంట్లు సోమాలియాను ఇస్లామిక్ స్టేట్ ప్రధాన కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement