‘మిషన్‌ శక్తి’ గురించి చైనా ఏమన్నదంటే | China First Reaction To India Space Missile Test Mission Shakti | Sakshi
Sakshi News home page

‘మిషన్‌ శక్తి’ గురించి చైనా ఏమన్నదంటే

Mar 27 2019 8:42 PM | Updated on Mar 27 2019 8:45 PM

China First Reaction To India Space Missile Test Mission Shakti - Sakshi

బీజింగ్ : ‘మిషన్‌ శక్తి’ పేరిట దేశ భద్రత కోసం అభివృద్ధి చేసిన యాంటీ శాంటిలైట్‌ క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. డీఆర్‌డీఓ, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని నరేంద్ రమోదీ బుధవారం ప్రకటించారు. అయితే ఈ ప్రయోగం సక్సెస్‌ పట్ల చైనా ఆచితూచి స్పందించింది. ‘మిషన్ శక్తి’ ప్రయోగాన్ని స్వాగతించడం గానీ, వ్యతిరేకించడం గానీ చేయకుండా క్లుప్తంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

అంతరిక్షంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రపంచదేశాలపై ఉందంటూ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత్ మాత్రమే కాకుండా.. క్షిపణి ద్వారా ఉపగ్రహాలను కూల్చివేయగల సామర్థ్యాన్ని సాధించిన అన్ని దేశాలు కూడా అంతరిక్షంలో శాంతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఈ తరహా అంతరిక్ష, సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా, ఒకప్పటి సోవియట్ రష్యా, చైనాలు ఇప్పటికే ఉపగ్రహాలను పేల్చివేయగల సామర్థ్యం ఉన్న క్షిపణులను రూపొందించాయి. ఈ తరహా సాంకేతిక ప్రయోగాన్ని చైనా పన్నేండెళ్ల క్రితమే చేసింది. 2007, జనవరిలో చైనా అంతరిక్షంలో ఉన్న తన క్రియారహిత వాతావరణ ఉపగ్రహాన్ని యాంటి శాటిలైట్‌ క్షిపణి సాయంతో నాశనం చేసి విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement