వైమానిక దాడుల్లో 31 మంది తీవ్రవాదులు హతం | 31 militants killed in Pakistan air strikes | Sakshi
Sakshi News home page

వైమానిక దాడుల్లో 31 మంది తీవ్రవాదులు హతం

Jan 4 2015 9:09 AM | Updated on Sep 2 2017 7:13 PM

పెషావర్ ఘటనతో పాక్ సైన్యం దేశంలోని తీవ్రవాదులపై దాడిని మరింత ముమ్మరం చేసింది.

ఇస్లామాబాద్: పెషావర్ ఘటనతో పాక్ సైన్యం దేశంలోని తీవ్రవాదులపై దాడిని మరింత ముమ్మరం చేసింది. ఆ క్రమంలో ఆదివారం తిహర్ వ్యాలీలోని కోకి ఖేల్ ప్రాంతంలో ఆత్మాహుతి దళానికి శిక్షణ ఇచ్చే కేంద్రంపై వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో 31 మంది తీవ్రవాదులు హతమయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో ఆత్మాహుతి దళ సభ్యులతోపాటు తీవ్రవాదులు కూడా ఉన్నారని పేర్కొంది. గతేడాది డిసెంబర్ 16న పెషావర్లో ఆర్మీ పాఠశాలలో తీవ్రవాదులు నరమేధం సృష్టించారు. ఈ ఘటనలో 150 మంది మరణించగా... వారిలో 140 మంది విద్యార్థులు ఉన్న విషయం తెలిసింది. దీంతో తీవ్రవాదులపై పాక్ తన దాడులను ముమ్మరం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement