దీపకు వైఎస్ జగన్ అభినందనలు


హైదరాబాద్: రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మకార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు.



త్రిపురకు చెందని దీప ఈ ఏడాది జరిగే  రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా ఆమె చరిత్ర సృష్టించింది.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top