బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి! | yadagiri went to police station with bullet injuries, says police commissioner | Sakshi
Sakshi News home page

బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి!

Aug 13 2016 2:01 PM | Updated on Mar 18 2019 7:55 PM

బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి! - Sakshi

బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి!

ఓల్డ్ బోయిన్ పల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన కాల్పులకు భూ వివాదాలే కారణమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

ఓల్డ్ బోయిన్ పల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన కాల్పులకు భూ వివాదాలే కారణమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని, ఈ పెనుగులాటలోనే కాల్పులు జరిగాయని ఆయన వివరించారు. కాల్పులు జరిగిన తర్వాత బుల్లెట్ గాయాలతోనే యాదగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. అయితే ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకి ఎవరిదనే విషయమై ఇంకా స్పష్టత లేదన్నారు.

సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం యాదగిరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. అల్వాల్‌లో ఓ భూ వివాదానికి సంబంధించి యాదగిరికి, మరో వ్యక్తికి మధ్య గొడవలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement