అతివేగంతో వస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది.
హైదరాబాద్: అతివేగంతో వస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఆరాంఘర్ వద్ద పీవీ ఎక్స్ప్రెస్ వేపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలు అయ్యాయి. నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో వాహనాలు ఎక్కడిక్కడా నిలిచిపోయి భారీగా ట్రాఫిక్జామ్ నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.