ఐదు నెలలుగా జీతాల్లేవు | There is no salaries from last five months | Sakshi
Sakshi News home page

ఐదు నెలలుగా జీతాల్లేవు

Aug 13 2017 2:58 AM | Updated on Oct 9 2018 7:11 PM

ఐదు నెలలుగా జీతాల్లేవు - Sakshi

ఐదు నెలలుగా జీతాల్లేవు

పేదలకు సేవచేసే కాంట్రాక్టు వైద్యుల పరిస్థితి దయనీయంగా మారింది.

307 మంది కాంట్రాక్టు వైద్యుల అవస్థలు
 
సాక్షి, హైదరాబాద్‌: పేదలకు సేవచేసే కాంట్రాక్టు వైద్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారి సేవలను రెగ్యులర్‌ చేయడం ఎలా ఉన్నా.. కనీసం చేస్తున్న పనికి జీతం కూడా ఇవ్వట్లేదు. సర్వీస్‌ రెగ్యులర్‌ కావడంపై ఆందోళనతో ఉన్న కాంట్రాక్టు వైద్యులకు 5 నెలలుగా వేతనాలు రాకపోవడం మరింత ఇబ్బంది కలిగిస్తోంది. ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా 307 మంది వైద్యులు కాంట్రాక్టు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లుగా పని చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం 2014 జూలై 1న జారీ చేసిన కాంట్రాక్టు ఉద్యోగుల మార్గదర్శ కాల ప్రకారం వీరు పని చేస్తున్నారు. ఏళ్లుగా కాంట్రాక్టు వైద్యులుగా పని చేస్తున్న వీరు సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అంశంపై చర్చ జరుగుతున్నా ఆచరణలోకి రావట్లేదు. కాంట్రాక్టు అసిస్టెంట్‌ సర్జన్ల సర్వీసును ప్రతి ఏటా కొనసాగిస్తేనే వీరికి వేతనాలు అందు తాయి. వీరి కాంట్రాక్టు సర్వీసును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పొడిగించడంలో వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 307 మంది కాంట్రాక్టు వైద్యులకు 2017 మొదటి నుంచి వేతనాలు అందట్లేదు. 307 మంది అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్ల కాంట్రాక్టు సర్వీసును పొడిగిస్తూ జూలై 25న ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి 31 వరకు వీరి సర్వీసు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర్వులు విడుదలై 2 వారాలైనా ఇప్పటికీ వేతనాలు రాలేదు. వీరికి వేతనాలు చెల్లించక పోవడంతో గ్రామీణ పేదలకు అందే వైద్య సహాయంపై ప్రభావం పడుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement