యువకుడి ఆత్మహత్యాయత్నం | The young man commit suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్యాయత్నం

Sep 12 2016 6:11 PM | Updated on Nov 6 2018 8:04 PM

ప్రియురాలి తో పెళ్లి కాదన్నందుకు యువకుడి ఆత్మహత్యాయత్నం.

ప్రేమించిన యువతిని తన నుంచి దూరం చేయడమే కాకుండా ఆమె తరపు బంధువులు దాడి చేయడానికి రావడంతో ఓ యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఫిలింనగర్‌లోని బండారు బాల్‌రెడ్డి నగర్ బస్తీలో నివసించే కె.జగన్(18) కొరియర్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. అదేబస్తీలో నివసించే యువతి(16)ని ఏడాదిన్నర కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఆరు నెలల క్రితమే వివాహమైంది. ఆమె కాపురం చేయకుండా జగన్‌తో సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం కనిపించకుండాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిద్దరినీ పట్టుకున్నారు. జగన్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించగా ఆదివారం రాత్రి జగన్ ఇంటిపై కొంత మంది దాడి చేశారు. భయంతో జగన్ నిద్రమాత్రలు మింగడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన ఇంటిపై పెద్దయ్య, తిరుపతయ్య, వెంకటయ్య, అంజి, విష్ణు, శంకర్, లక్ష్మమ్మ తదితరులు దాడి చేశారని, తనను, కొడుకును తీవ్రంగా కొట్టారని, ఇది భరించలేక తన కొడుకు నిద్రమాత్రలు మింగాడంటూ శాంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యువతిని రెస్కూ హోంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement