కొత్తగా రెండు భారీ రైలు టెర్మినళ్లు | The new two major rail terminals | Sakshi
Sakshi News home page

కొత్తగా రెండు భారీ రైలు టెర్మినళ్లు

Nov 21 2014 1:21 AM | Updated on Sep 2 2017 4:49 PM

కొత్తగా రెండు భారీ రైలు టెర్మినళ్లు

కొత్తగా రెండు భారీ రైలు టెర్మినళ్లు

అటు ఉత్తరాదికి, ఇటు దక్షిణాదికి కీలకంగా మారిన సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుఇరుకుగా మారడం.

ఇరుకుగా ఉన్న  సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా..
మౌలాలి, వట్టినాగులపల్లి స్టేషన్లలో నిర్మాణం

 
సాక్షి, హైదరాబాద్:
అటు ఉత్తరాదికి, ఇటు దక్షిణాదికి కీలకంగా మారిన సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుఇరుకుగా మారడం. రైళ్లరద్దీ, ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయంగా రాష్ట్రరాజధానిలో మరో రెండు భారీ టెర్మినళ్లు నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్‌లో స్థానం కల్పించాలని కోరుతూ  రైల్వేబోర్డుకు ప్రతిపాదనలను పంపింది. దాదాపు రూ.120 కోట్ల ఖర్చయ్యే ఈ పనులకు డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నిత్యం దాదాపు 210 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

కానీ ఈ స్టేషన్‌లో 10 ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. నగరంలో కీలకంగా మారిన ఎంఎంటీఎస్ రైళ్లకు కూడా ఇవే శరణ్యం. దీంతో ప్లాట్‌ఫామ్స్ దొరికేవరకు పలు రైళ్లను మౌలాలి సహా ఇతర శివారు స్టేషన్‌లలో నిలిపివేస్తున్నారు. కొన్నింటినైతే సుమారు 40 నిమిషాలవరకు ఆపేస్తున్నారు. అందుకే కొత్త టెర్మినళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అవి పూర్తయితే ముఖ్యమైన రైళ్లను మాత్రమే సికింద్రాబాద్ వరకు రప్పిస్తారు. మిగతావాటిని కొత్తస్టేషన్లలోనే నిలిపేస్తారు. దీంతో సికింద్రాబాద్‌పై భారం తగ్గుతుందని భావిస్తున్నారు.  

ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో సీసీటీవీలు...
భద్రతదృష్ట్యా నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థతోకూడిన సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఈమేరకు నిర్ణయించారు.  అన్ని లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని   పేర్కొన్నారు.

ప్రాధాన్యక్రమంలో పనులు : జీఎం శ్రీవాస్తవ
గతంలో మంజూరైన పనులు కూడా చాలావరకు పెం డింగ్‌లో ఉన్నందున ముఖ్యమైన వాటిని ప్రాధాన్యక్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ చెప్పారు. గురువారం ఆయన ప్రధాన విభాగాల అధికారులతో సమావేశమయ్యా రు. రూ.5490 కోట్లతో వివిధ దశల్లో ఉన్న 637 పను పెండింగ్ పనులు, ప్రతిపాదనలను సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement