ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని,..
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతీ ఒక్కరూ అత్యంత ఆనందంతో పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సీఎంవో ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు కేసీఆర్ ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లనున్నారు. సూర్యాపేట నుంచి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో వెళతారు. ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.