► ఎంజీఎంలో అక్రమాలపై విజిలెన్స్ నివేదిక
► చర్యలు తీసుకోవాలని డీఎంఈకి ప్రభుత్వ ఆదేశం
► చర్యలలో జాప్యంపై లోకాయుక్తలో ఫిర్యాదు
► డీఎంఈ, ఎంజీఎం సూపరింటెండెంట్కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో పేరొందిన మహాత్మాగాంధీ స్మారక ఆసుపత్రి (ఎంజీఎం)లో గతంలో వెలుగుచూసిన ఆక్సిజన్ సిలిండర్ల అక్రమాల వ్యవహారం లోకాయుక్తకు చేరింది. కోట్ల రూపాయల అక్రమాలు జరిగినా బాధ్యులపై చర్యల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తు న్నారనే ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది. అక్రమాలపై చర్యల విషయంలో వైద్య విద్య సంచా లకుడు, ఎంజీఎం సూపరింటెండెంట్కు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న కేసు విచారించనున్న ట్లు తెలిపింది. ఆ రోజులోపు ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఒక్కో సిలిండర్పై రూ.155 అదనం!
మహాత్మాగాంధీ స్మారక ఆసుపత్రిలో సగటున రోజుకు 70–80 ఆక్సిజన్ సిలిండర్లు అవసరమ వుతాయి. ఆసుపత్రి రికార్డుల ప్రకారం... 2007–13 మధ్య మొత్తం 1,35,744 సిలిండర్లు హన్మకొండకు చెందిన తులసీ ఏజెన్సీ నుంచి కొనుగోలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు రూ.230కు సిలిండర్ను సరఫరా చేసిన కాంట్రాక్టర్... ఎంజీఎంకు రూ.385 చొప్పున అంటగట్టిన వ్యవహారం 2014లో వెలుగులోకి వచ్చింది. ఒక్కో సిలిండర్పై రూ.155 చొప్పున సర్కారుకు నష్టం వాటిల్లింది. ఆరేళ్లు సాగిన ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ఇదీ చాలదన్నట్లు సిలిండర్లకు రోజుకు రూ.26 చొప్పున అద్దె సైతం చెల్లించింది. ఈ ఆరోపణలపై విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపింది. 2016 ఏప్రిల్ 21న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాకు బిల్లు చెల్లింపులో ప్రభుత్వానికి రూ.2,30,92,275 నష్టం జరిగిందని నిర్ధారించింది. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని 2016 నవంబర్లో వైద్య విద్య సంచాలకుడిని ఆదేశించింది. అయినా చర్యలు తీసుకోకపోవడంపై వైద్య విద్య సంచాల కుడు, ఎంజీఎం సూపరింటెండెంట్ ఎలాంటి చర్య లు తీసుకోవడంలేదని వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి ఆగస్టు 21న లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోకాయుక్త... బాధ్యులకు నోటీసులు ఇచ్చింది.
రూ.2.3 కోట్ల ఆక్సిజన్ దందా
Published Fri, Sep 1 2017 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement