ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన పోకిరీలు | Rogues throw stones on Intercity Express | Sakshi
Sakshi News home page

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన పోకిరీలు

Oct 2 2016 1:27 AM | Updated on Sep 4 2017 3:48 PM

ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై శుక్రవారం రాత్రి పోకిరీలు రాళ్లు రువ్వడంతో ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యారుు.

రఘునాథ్ అనే యువకుడి కంటికి గాయాలు
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స

 
హైదరాబాద్: ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై శుక్రవారం రాత్రి పోకిరీలు రాళ్లు రువ్వడంతో ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యారుు. ఈ ఘటనలో గద్వాల ప్రాంతానికి చెందిన రఘునాథ్ (25) అనే యువకుడికి ఎడమ కంటికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం రఘునాథ్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో గద్వాల నుంచి కాచిగూడకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. రఘునాథ్ తండ్రి బాలరాజు కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement