ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లు జాతీయ సంపద:వైఎస్ జగన్ | RK Laxman cartoons are national wealth: YS Jagan | Sakshi
Sakshi News home page

ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లు జాతీయ సంపద:వైఎస్ జగన్

Jan 27 2015 12:12 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి - Sakshi

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి

ప్రముఖ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు.

 హైదరాబాద్:  ప్రముఖ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. దేశంలో రాజకీయ వ్యంగ్య చిత్రానికి నడకలు నేర్పిన మహా మనిషి లక్ష్మణ్ అని కొనియాడారు. ఆయన కార్టూన్లు మన జాతీయ సంపద అని పేర్కొన్నారు.  అంతటి మహానుభావుడు అస్తమించాడన్న వార్త విని ఎంతో బాధ చెందినట్లు తెలిపారు.

. ఆ మహనీయుడికి యావత్ భారత్ జాతి గుండెల నిండా కన్నీరు నింపుకొని నివాళి అర్పిస్తోందని పేర్కొన్నారు. భారతదేశమే కాక ప్రపంచమే గర్వించదగ్గ కార్టూనిస్టుగా లక్ష్మణ్ ఎప్పటికీ నిల్చిపోతారని కీర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement