ఇంటర్నేషనల్ కాల్స్ను డైవర్ట్ చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్నేషనల్ కాల్స్ డైవర్ట్: ఇద్దరు అరెస్ట్
Apr 13 2017 1:14 PM | Updated on Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: ఇంటర్నేషనల్ కాల్స్ను డైవర్ట్ చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరధిలో ఏడాది కాలంగా ఇంటర్నేషనల్ కాల్స్ను వాయిస్ కాల్ప్గా మారుస్తున్న ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి చెందిన రెండు స్థావరాలపై దాడులు నిర్వహించి భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు వివిధ నెట్వర్క్లకు చెందిన 1400 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా నిందితులు నెలకు కోటి రూపాయలు వరకు సంపాదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Advertisement


