సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ మంజూరుకు ఉద్దేశించిన వాటర్గ్రిడ్ పథకం అంచనాలు సిద్ధమయ్యాయి. సుమారు కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్లైన్ గ్రిడ్ ఏర్పాటుకు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంచేసింది. వీటికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపితే పథకం పనులు మొదలుకానున్నాయి. గ్రిడ్కు సంబంధించిన ప్రాథమిక కసరత్తును జలమండలి పూర్తిచేసింది. ఇందుకోసం ఓ మాస్టర్ప్లాన్ ప్రణాళిక చిత్రపటాన్ని కూడా రూపొందించింది.
గ్రిడ్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన పైప్లైన్లు, స్టోరేజీ రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, గ్రావిటీ ఆధారంగా నీటిసరఫరా తదితర అంశాలపై సమగ్ర డిజైనింగ్, డ్రాయింగ్లు పూర్తిచేసే సాంకేతిక పనులను ప్రముఖ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. అయితే గ్రేటర్ వాటర్గ్రిడ్ ముఖచిత్రంపై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశంలో గ్రిడ్ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
తీరనున్న శివార్ల దాహార్తి ...
* గ్రేటర్లో విలీనమైన పలు శివారు మున్సిపాల్టీల్లో ప్రస్తుతం మంచినీటి సరఫరా తీరును పరిశీలిస్తే...శేరిలింగంపల్లిలో కేవలం 30 శాతం ప్రాంతాలకే నీటి సరఫరా పైప్లైన్ నెట్వర్క్ ఉంది.
* రాజేంద్రనగర్లో 45 శాతం, కుత్భుల్లాపూర్లో 50 శాతం, మల్కాజ్గిరిలో 65 శాతం, కూకట్పల్లిలో 70 శాతం, ఉప్పల్లో 82.5 శాతం, ఎల్బీనగర్లో 85 శాతం, కాప్రాలో 85 శాతం, అల్వాల్లో 90 శాతం ప్రాంతాలకే మంచినీటి సరఫరా నెట్వర్క్ ఉంది. ఈనేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో పైప్లైన్ నెట్వర్క్ విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్లు, పంప్హౌజ్ల నిర్మాణానికి ఈ గ్రిడ్ పథకంలో స్థానం కల్పించడం విశేషం.
గ్రేటర్ వాటర్గ్రిడ్ అంచనాలివే
ఔటర్ రింగ్రోడ్డుకు లోపల ఉన్న ప్రాంతాల్లో గ్రేటర్ వాటర్గ్రిడ్ ఏర్పాటుకానుంది. సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో 2021 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభా, ఐటీ, హార్డ్వేర్ పరిశ్రమల విస్తరణ, పారిశ్రామికీకరణ అవసరాలకు వినియోగించే నీటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చేపట్టబోయే వాటర్గ్రిడ్ పనులు-వాటి అంచనా వ్యయాలిలా ఉన్నాయి. (నిధులు రూ.కోట్లలో)
* కృష్ణా హెడ్వర్క్స్ పనులు: రూ.1184
* కృష్ణా ఫేజ్-4 (110కి.మీ): రూ.1760
* కృష్ణాఫేజ్-4 నీటిశుద్ధికేంద్రాలు, రిజర్వాయర్ల నిర్మాణం: రూ.848
* ఔటర్రింగ్రోడ్డు చుట్టూ 160 కి.మీ పరిధిలో 3000 డయా వ్యాసార్థంగల నీటి పంపిణీ పైప్లైన్ల ఏర్పాటు: రూ.2860
* ఔటర్లోపల నీటిపంపిణీకి 1000 డయా వ్యాసార్థంగల రేడియల్ మెయిన్పైప్లైన్ల ఏర్పాటు:రూ.1040
* జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని కాలనీలు,బస్తీలకు నీటిసరఫరా పైప్లైన్ నెట్వర్క్ ఏర్పాటు:రూ.3195
* శివారు మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీలు, నగరపంచాయతీలకు నీటి పంపిణీకి 3653 కి.మీపైప్లైన్ల ఏర్పాటు-రూ.2608
* మొత్తం:13,495 కోట్లు
వాటర్గ్రిడ్ మాస్టర్ప్లాన్ రెడీ!
Published Mon, Nov 24 2014 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement