మోదీ, కేసీఆర్పై మధుయాష్కీ ఫైర్ | Sakshi
Sakshi News home page

మోదీ, కేసీఆర్పై మధుయాష్కీ ఫైర్

Published Thu, Apr 14 2016 1:49 PM

madhu yashki fire on modi and kcr

హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్లో మధు యాష్కీ మాట్లాడుతూ... హెచ్సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారుకులైన వారే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ దళితులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్పై మధు యాష్కీ నిప్పులు చెరిగారు.
 

Advertisement
Advertisement