- ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ లేఖ
- సాగర్, శ్రీశైలం నీటిని జూలై వరకు పంచడమే ప్రధాన ఎజెండా
- టెలీమెట్రీ పరికరాలపైనా చర్చ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 30న భేటీ కానుంది. సోమవారం ఈమేరకు భేటీ వివరాలను బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ ఇరురాష్ట్రాలకు లేఖ ద్వారా సమాచారం అందించారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లి నీటిని పంపిణీ చేయాలన్న డిమాండ్లతోపాటు టెలీమెట్రీ పరికరాల అమరిక అంశాన్ని ప్రధాన ఎజెండాలో చేర్చారు.
గతంలో బోర్డు సమక్షంలో ఇరురాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్లో 502 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల వరకు నీటిని తీసుకోవాల్సి ఉంది. ఈ మట్టాల వద్ద ప్రస్తుతం కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే ఉండటం, ఆ నీరంతా ఏపీకే దక్కనుండటంతో తెలంగాణ తన అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరుతోంది. సాగర్లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల మట్టం వరకు వెళ్లేందుకు అవకాశం ఇస్తే హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. నల్లగొండ తాగునీటికి 2.25 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 2 టీఎంసీలు కావాలని ఇటీవలే విన్నవించింది. దీనిపై త్రిసభ్య కమిటీ నిర్ణయం చేయాల్సి ఉంది.
టెలీమెట్రీపై తెలంగాణ ఆగ్రహం
ఇక ఇదే భేటీలో కృష్ణా జలాల వినియోగంపై పక్కా లెక్కలు ఉండేందుకు ఉద్దేశించిన టెలీమెట్రీ పరికరాలపైనా చర్చ జరగనుంది. ఈ పరికరాల అమరిక విషయంలో ఇప్పటికే తెలంగాణ ఉడుకుమీదుంది. మొదటి విడతలో గుర్తించిన 18 పాయింట్లలో చాలా చోట్ల తెలంగాణలో వాటిని అమర్చే పనులు పూర్తయినా, ఏపీలో పూర్తి కాలేదు. రెండో విడతలో మరో 28 చోట్ల అమర్చాల్సి ఉండగా, 17 పాయింట్లపై తమకు అభ్యంతరాలు ఉన్నాయంటూ ఏపీ అడ్డుపడుతోంది. దీనిపై ఇదివరకే బోర్డుకు ఫిర్యాదు చేసినా పెద్దగా స్పందన లేకపోవడంతో త్రిసభ్య కమిటీలోనే తేల్చుకోవాలని తెలంగాణ గట్టి పట్టుదలతో ఉంది.
పక్షపాత ధోరణి వద్దు: హరీశ్
టెలీమెట్రీ పరికరాల అమరిక అంశమై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు.. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. టెలీమెట్రీ పరికరాల అమరికలో పక్షపాత ధోరణి వద్దని, ఇరురాష్ట్రాల్లో సమానంగా ఏర్పాటు చేసేలా చేర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గోదావరి బోర్డు చైర్మన్ హెచ్కే సాహుతో సైతం వివిధ అంశాలపై చర్చించారు.
30న కృష్ణా బోర్డు కమిటీ భేటీ
Published Tue, May 23 2017 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement