కల్లుగీత విధానం రూపొందించాలి | Kallugita Unions Appeal to the minister padmarao | Sakshi
Sakshi News home page

కల్లుగీత విధానం రూపొందించాలి

Sep 13 2017 2:11 AM | Updated on Sep 19 2017 4:26 PM

కల్లుగీత విధానం రూపొందించాలి

కల్లుగీత విధానం రూపొందించాలి

రాష్ట్రంలో కల్లుగీత విధానాన్ని రూపొందిం చాలని ఎక్సైజ్‌ మంత్రి పద్మారావుగౌడ్‌కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ విన్నవించింది.

మంత్రి పద్మారావుకు కల్లుగీత సంఘాల విజ్ఞప్తి
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కల్లుగీత విధానాన్ని రూపొందిం చాలని ఎక్సైజ్‌ మంత్రి పద్మారావుగౌడ్‌కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ విన్నవించింది. మంగళవారం ఈ మేరకు సమన్వయ కమిటీ చైర్మన్‌ బాలగోని బాలరాజు గౌడ్, గౌడ హాస్టల్‌ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. తాటి, ఈత చెట్లపై విధించే పన్ను, అద్దెను ఎత్తివేయాలని, కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. శాశ్వత లైసెన్స్‌ విధానం తేవాలని, లైసెన్సులు ఆటోమెటిక్‌గా రెన్యూవల్‌ అయ్యేలా చూడాలన్నారు. టీసీఎస్‌ వ్యవస్థను ప్రోత్సహించాలని, కనీస సభ్యుల సంఖ్యను తగ్గిస్తూ నిబంధనలు సవరించాలన్నారు.

ప్రతి సభ్యుడికి 30 చెట్లు ఉండాలనే నిబంధనలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికుల భాగస్వాములకు నెలకు రూ.5 వేలు పెన్షన్‌ ఇవ్వాలన్నారు. గౌడ భవన నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించి, రూ.10 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. వృత్తిదారుల ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని, అదే విధంగా పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడంతో పాటు హైస్కూల్‌ స్థాయిలో పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement