కేటీఆర్‌కు ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ ఆహ్వానం

కేటీఆర్‌కు ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ ఆహ్వానం - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 27న ఢిల్లీలోని ప్రగతిమైదాన్‌లో జరగనున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌–2017 సమావేశానికి ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందింది. కేంద్ర కమ్యూనికేషన్స్‌శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా ఈ మేరకు ప్రత్యేకంగా ఆహ్వానించారని మంత్రి కేటీఆర్‌ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలిసారిగా కేంద్రం నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రసంగించాలని మంత్రిని కోరినట్లు పేర్కొంది.



‘‘సస్టైనబుల్‌– వైఫై’’అనే అంశంపై ప్రసంగించాలని కేటీఆర్‌ను ఆహ్వానించినట్లు వెల్లడించింది. ఇంటింటికీ ఇంటర్నెట్‌ ప్రాజెక్టు, డిజిటల్‌ పేమెంట్స్, స్మార్ట్‌ ఎనర్జీ సొల్యూషన్స్, ఈ–హెల్త్, ఈ–విద్యా వంటి అంశాలపైన మంత్రి ఈ సమావేశంలో ప్రసంగించనున్నారని పేర్కొంది.   
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top