రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించి లక్షలాది రూపాయలు దండుకున్న ఇద్దరు వ్యక్తులను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం
Aug 17 2017 12:02 PM | Updated on Sep 4 2018 5:29 PM
హైదరాబాద్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించి లక్షలాది రూపాయలు దండుకున్న ఇద్దరు వ్యక్తులను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిరుద్యోగులను మోసం చేసి సుమారు 20 లక్షల రూపాయల వరకు దండుకున్న వెంకట్ రెడ్డి, రాజేష్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు అదుపు చేశారు. శివ అనే మరో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
Advertisement