ఎంసెట్ -2 లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక | Eamcet-2 paper leak; CID submits report to Telangana Govt | Sakshi
Sakshi News home page

ఎంసెట్ -2 లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక

Jul 29 2016 10:35 AM | Updated on Aug 11 2018 8:21 PM

ఎంసెట్-2 పేపర్ లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక సీఐడీ ఇవ్వనుంది.

హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక సీఐడీ ఇవ్వనుంది. ఈ నివేదికను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఎంసెట్ -2 లీకేజీలో అదుపులోకి తీసుకున్న తిరుమల్, విష్ణులను పోలీసులు రిమాండ్కు తరలించారు. అలాగే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని... రహస్య ప్రదేశంలో సీఐబీ అధికారులు విచారిస్తున్నారు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం సీఐడీ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే ఎంసెట్ -2 లీకేజీపై నగరంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు సచివాలయం, మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement