EAMCET-2 paper leak
-
ఎంసెట్–2 లీకేజీపై దర్యాప్తు చేయాలి
కారకులైన మంత్రులను బర్తరఫ్ చేయాలి మానుకోటలో కబ్జాకోరుల ఆగడాలు మితిమీరాయి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మహబూబాబాద్ : ఎంసెట్–2 పేపర్ లీకేజీ ఘటనతో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పలువురికి సంబంధాలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. దీనికి కారకులైన మంత్రులను గుర్తించి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మార్వాడి సత్రంలో మానుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాలుచౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంసెట్ పేపర్ల లీకేజీపై పకడ్బందీగా దర్యాప్తు జరగాలన్నారు. మానుకోటలో కబ్జాకోరుల ఆగడాలు మితిమీరాయన్నారు. గుడి, బడినీ కబ్జా చేసే ప్రజాప్రతినిధులు ఉండటం బాధాకరమన్నారు. అటువంటి వారిపై ప్రజలు పోరాటం చేయాలన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం వేలాది ఎకరాల భూములను కొనే విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రాచరిక పాలనను తలపించేలా కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇప్పటికైనా వైఖరిని మార్చుకోవాలని కేసీఆర్కు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఇప్పటికైనా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూసేకరణ చట్టంపై ఈ నెల 4న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలన్నారు. నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. రైతుల పక్షాన నిరంతరం పోరాడుతున్న ఘనత టీడీపీకి మాత్రమే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పుల్లూరు అశోక్ కుమార్, గట్టు ప్రసాద్, డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంచందర్నాయక్, భూపతి మల్లయ్య, భూక్య సునిత, చుక్కల ఉదయ్చందర్, కొండపల్లి రాంచందర్రావు, మార్నేని రఘు, పాషా, భోజ్యా నాయక్, సంపతి భీష్మా, బొమ్మ వెంకటేశ్వర్లు, రాజు, ఊమ్లానాయక్, శ్యాం, సుతారపు వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్ -2 లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక సీఐడీ ఇవ్వనుంది. ఈ నివేదికను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఎంసెట్ -2 లీకేజీలో అదుపులోకి తీసుకున్న తిరుమల్, విష్ణులను పోలీసులు రిమాండ్కు తరలించారు. అలాగే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని... రహస్య ప్రదేశంలో సీఐబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం సీఐడీ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే ఎంసెట్ -2 లీకేజీపై నగరంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు సచివాలయం, మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
ఎంసెట్ -2 లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక
-
ఎంసెట్–2 లీకేజీపై విచారణ
బాధిత తల్లిదండ్రులకు సీఐడీ అధికారుల ఫోన్లు సమాచార సేకరణలో నిమగ్నం అక్రమాలు జరిగినట్లు వివరించిన బాధితులు పరకాల : పరీక్షకు ముందే పేపర్ లీకైనట్లు బాధిత తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎంసెట్–2పై సీఐడీ విచారణ ను ముమ్మరం చేసింది. ఎంసెట్–2లో అవకతవకలు జరిగినట్లు.. అందులో వరంగల్ జిల్లా పరకాల, భూపాలపల్లి ప్రాంతాల నుంచి కొందరి మార్కులు, ర్యాంకులపై అనుమానాలు రావడంతో అధికారుల దృష్టి అంతా ఇటు వైపే ఉంది. ఎంసెట్–2 అక్రమాలపై పోలీసు, ఇంటెల్జెన్స్ అధికారులు వివరాలను ఇది వరకే సేకరించగా శనివారం సీఐడీ అధికారులు బాధితుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం తీసుకుంటున్నట్లు తెలిసింది. సీఐడీ డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు స్వయంగా ఫోన్లో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో ఎంతమందికి అక్రమంగా ర్యాంకులు వచ్చాయో తెలుసుకున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటీ అనే కోణంలో ఆరా తీశారు. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్–1, టీఎస్ ఎంసెట్–2లో వచ్చిన మార్కులు, ర్యాంకులను ప్రస్తావిస్తూ బాధితులు క్షుణ్ణంగా వివరించినట్లు తెలిసింది. కేవలం 40 రోజుల వ్యవధిలోనే జరిగిన పరీక్షల్లో వేలల్లో ఉన్న ర్యాంకులు వందల్లోకి వచ్చాయని వివరించారు. కోచింగ్ సెంటర్లో అంతగా ప్రతిభ కనబర్చనప్పటికీ మొదటిసారి పరీక్షకు హాజరైన విద్యార్థుల ర్యాంకులు అనుమానాలకు తావిస్తోందని చెప్పినట్లు తెలిసింది. ఒకే సెంటర్లో శిక్షణ పొంది సరిగ్గా వారం రోజుల కిందటనే రహస్య ప్రాంతానికి తరలివెళ్లారని చెప్పినట్టు సమాచారం. ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడుతున్న బాధితులు సీఐడీ విచారణ పేరుతో కాలయాపన చేస్తే ప్రత్యక్షంగా ఆందోళనకు సిద్ధం కావాలని బాధితులు ప్రయత్నిస్తుట్లు తెలుస్తోంది. సీఐడీని ఉపయోగించుకోని విచారణను జాప్యం చేస్తే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపడుతుండగా వారి మద్దతును తీసుకొని అవసరమైతే నిరాహార దీక్షలకు కూర్చోవాలని ఆలోచిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. విచారణ జాప్యమైతే ఒక విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.