సచివాలయంలో సీఎం మనవడు | cm grand son in secreteriate | Sakshi
Sakshi News home page

సచివాలయంలో సీఎం మనవడు

Feb 13 2016 5:57 AM | Updated on Aug 13 2018 4:03 PM

సచివాలయంలో సీఎం మనవడు - Sakshi

సచివాలయంలో సీఎం మనవడు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనవడు, మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు రాష్ట్ర సచివాలయంలో అడుగు పెట్టాడు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనవడు, మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు రాష్ట్ర సచివాలయంలో అడుగు పెట్టాడు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కాన్వాయ్ కారులో సమత బ్లాక్‌కు వచ్చాడు. హిమాన్షు వెంట మరో ఇద్దరు తన మిత్రులున్నారు. సీ బ్లాక్‌లోకి వెళ్లి సీఎం చాంబర్‌తో పాటు అందులో ఉన్న ఉన్నతాధికారుల ఆఫీసులను చూసి వెనుదిరిగాడు. ముఖ్యమంత్రి, మంత్రి సచివాలయంలో లేని సమయంలో హిమాన్షు రావటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement