అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చునని విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు.
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చునని విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఇష్టాగోష్టిగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చుననే వార్తలు వస్తున్నాయి కదా అని విలే కరులు ప్రస్తావించగా ‘మంత్రివర్గ విస్తరణ, మార్పు చేర్పులు అనేవి పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోనివి.
దానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడా, అయిపోయిన తర్వాతనా అనేది ఎందుకు? ముఖ్యమంత్రి అనుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉండొచ్చు’ అని వ్యాఖ్యానించారు.