- జర్మనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీషోకేస్ కొనుగోలు
- విదేశీ సంస్థతో ఒప్పందం.. మరో నెలలో ఏర్పాటు
- షోకేస్లోకి గాలిచొరబడకుండా నైట్రోజన్ జనరేటర్
- ఇప్పటికీ మమ్మీ సురక్షితమేనని స్కానింగ్, ఎక్స్రే ద్వారా నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: మనిషికి ప్రాణవాయువు గాలి.. అది అందకుంటే ఉక్కిరిబిక్కిరవుతాడు.. కానీ అదే ఆక్సిజన్ ‘ఆమె’ను అవసానదశకు చేర్చింది.. ఇప్పుడు ఆమెను రక్షించేం దుకు ఆక్సిజన్ అందకుండా చేయబోతున్నా రు. ఇందుకోసం జర్మనీ నుంచి ప్రత్యేక పరికరాన్ని తెప్పిస్తున్నారు. ఇదంతా డాక్టర్ వైఎస్సా ర్ స్టేట్ మ్యూజియంలో ఉన్న ‘మమ్మీ’ కథ.
స్టేట్ మ్యూజియంలో ఉన్న ప్రత్యేకతల్లో ముఖ్యమైంది ఈజిప్షియన్ మమ్మీ. సందర్శకులు దీన్ని ఆసక్తిగా తిలకిస్తుంటారు. అందుకే మ్యూజియం హాలులో ప్రాధాన్యం కల్పించి దీన్ని ఏర్పాటు చేశారు. కానీ దానికి శాస్త్రీయ సురక్షిత కవచం లేకపోవటంతో వాతావరణ పరిస్థితులు, వాయు, శబ్ద కాలుష్యం బారిన పడి దెబ్బతింది. ఇప్పుడు దీన్ని ‘రక్షించేం దుకు’ పురావస్తు శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.58 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ జొరబడని ఎయిర్ ఫ్రీ గ్లాస్ షోకేసును కొంటోంది. ఈ మేరకు జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మరో నెల రోజుల్లో ఈ షోకేసు నగరానికి చేరనుంది.
ఎందుకీ పరిస్థితి..
దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఈజిప్షియన్ మమ్మీలు ఉన్నాయి. ఇందులో దక్షిణాదిలో ఏకైక మమ్మీ మన స్టేట్ మ్యూజియంలో కొలువుదీరింది. 2353 ఏళ్ల క్రితం చనిపోయిన యువతి శవాన్ని ఈజిప్షియన్ పద్ధతుల్లో మమ్మీగా మార్చారు. దాన్ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అల్లుడు వేయి పౌండ్లు వెచ్చించి భాగ్యనగరానికి తెప్పించారు. ఆ తర్వాత ఇది ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్కు బహుమతిగా రావటంతో 1930లో దాన్ని ఆయన స్టేట్ మ్యూజియంకు బహూకరించారు. అప్పటి నుంచి అది మ్యూజి యంలో ప్రధాన ఆకర్షణగా ఉంది. 4 వైపులా అద్దాలున్న చెక్క షోకేసులో ఈ మమ్మీని ఉంచారు. దీంతో లోనికి సులభంగా ఆక్సిజన్ జొరబడి బ్యాక్టీరియా ఉత్పన్నమై మమ్మీ క్రమంగా శిథిలమవుతూ వచ్చింది.
బాగా దెబ్బతిన్నాకగానీ పురావస్తు శాఖ అధికారులు దీనిని గుర్తించలేదు. దీంతో మమ్మీని ఎలా కాపాడాలో తెలియక ఇరాన్కు చెందిన నిపుణులకు కబురుపెట్టారు. వారు వచ్చి వెంటనే ఆక్సిజన్ ఫ్రీ షోకేస్ ఏర్పాటు చేయాలని చెప్పటంతో ఇప్పుడు దాన్ని తెప్పించే ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటన ఇవ్వటంతో జర్మనీకి చెందిన గ్లాస్బా అనే సంస్థ రూ.58 లక్షలకు కొటేషన్ వేసి ఎంపికైంది. ఇప్పుడు ఆ సంస్థతో పురావసు ్తశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల వారంటీ తో మరో నెల రోజుల్లో అది ఆక్సిజన్ ఫ్రీ షోకేస్ను సమకూర్చనుంది. దీనికి నైట్రోజన్ సరఫరా చేసే జనరేటర్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది.
ఆ మమ్మీ 16 ఏళ్ల యువతిది కాదట..
మ్యూజియంలో ఉన్న మమ్మీ ఈజిప్టు రాజకుటుంబానికి చెందిన 16 ఏళ్ల యువతిదిగా భావిస్తూ వచ్చారు. కానీ.. ఇటీవల స్కానింగ్, ఎక్స్రేలు తీసి పరిశీలించగా, అది 25 ఏళ్ల యువతిదని తేల్చారు. ఇప్పటికీ మెదడులోని కొంతభాగం చెక్కుచెదర లేదని, ఇతర ప్రధాన శరీర భాగాలు కూడా బాగానే ఉన్నాయని తేలింది. ఇది తదుపరి పరిశోధనలకూ ఉపయోగపడుతుందని గుర్తించారు.
‘మమ్మీ’కి ప్రాణం..!
Published Wed, Oct 5 2016 2:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement