మహిళపై యాసిడ్ దాడి | Sakshi
Sakshi News home page

మహిళపై యాసిడ్ దాడి

Published Fri, Nov 18 2016 7:48 PM

Acid attack on woman

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. కుత్బుల్లాపూర్ శివాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నడిచి వెళ్తున్న అయోధ్యనగర్‌కు చెందిన రాజేశ్వరి(30)పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ చల్లాడు. దీంతో ఆమె వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కేకలు వేయటంతో దుండగుడు పారిపోయాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement